తెలంగాణ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడానికి, సింపుల్ గా ఎలా ప్రిపేర్ అవ్వాలో, ఇక్కడ మనం కలిసి చదువుదాం, కలిసి నేర్చుకుందాం.
ఈరోజు ఇండియన్ చరిత్ర – మోడరన్ హిస్టరీ గురించి చదువుదాం.
క్లాసు-1 లో భాగంగా ఇండియన్ మోడరన్ హిస్టరీ సిపాయిల తిరుగుబాటులో భాగంగా దాని గురించి ముక్యమైన విషయలు ఇక్కడ చర్చిద్దాం.
సిపాయిల తిరుగుబాటు అనగానే మనం గుర్తుచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు
1857 సిపాయిల తిరుగుబాటు (The Revolt of 1857)
దీనిని “మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామం” అని పిలుస్తారు. బ్రిటిష్ వారి అణచివేత ధోరణికి వ్యతిరేకంగా భారతీయులు చేసిన మొదటి పెద్ద పోరాటం ఇది.
-
తక్షణ కారణం: రాయల్ ఎన్ఫీల్డ్ తుపాకులకు ఉపయోగించే తోటాలకు ఆవు, పంది కొవ్వును పూశారనే వార్త రావడం. ఇది హిందూ, ముస్లిం సైనికుల మత భావాలను దెబ్బతీసింది.
-
ప్రారంభం: 1857 మార్చి 29న బారక్పూర్లో మంగళ్ పాండే అనే సిపాయి బ్రిటిష్ అధికారిని కాల్చిచంపడంతో తిరుగుబాటు మొదలైంది.
-
ముఖ్య నాయకులు – ప్రాంతాలు:
-
ఢిల్లీ: బహదూర్ షా II (మొఘల్ చక్రవర్తి), భక్త్ ఖాన్
-
ఝాన్సీ: రాణీ లక్ష్మీబాయి
-
కాన్పూర్: నానా సాహెబ్, తాంతియా తోపే
-
లక్నో: బేగం హజ్రత్ మహల్
-
-
ఫలితం: తిరుగుబాటు విఫలమైనప్పటికీ, భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ముగిసింది. బ్రిటన్ రాణి (బ్రిటిష్ క్రౌన్) నేరుగా పరిపాలనను తన చేతుల్లోకి తీసుకుంది (1858 విక్టోరియా మహారాణి ప్రకటన).
పరీక్షల్లో మార్కులు సాధించడానికి వీలుగా ఈ తిరుగుబాటుకు గల కారణాలు, ముఖ్యమైన సంఘటనలు, నాయకులు మరియు దీని ఫలితాలను చాలా సింపుల్ గా, పాయింట్ల వారీగా కింద వివరించడం జరిగింది. కాబట్టి ఈ పేజి ని జాగ్రతగా సేవ్ చేసుకోవాలని మనవి.
తిరుగుబాటుకు ప్రధాన కారణాలు (Causes)
-
రాజకీయ కారణాలు: డల్హౌసీ ప్రవేశపెట్టిన “రాజ్యసంక్రమణ సిద్ధాంతం” (Doctrine of Lapse) ద్వారా ఝాన్సీ, సతారా, నాగ్పూర్ వంటి స్వదేశీ సంస్థానాలను బ్రిటిష్ వారు ఆక్రమించుకున్నారు.
-
ఆర్థిక కారణాలు: అధిక పన్నులు, చేతివృత్తుల నాశనం, రైతుల దోపిడీ.
-
సామాజిక, మతపరమైన కారణాలు: సతీసహగమనం రద్దు (1829), వితంతు పునర్వివాహ చట్టం (1856), భారతీయులను క్రైస్తవ మతంలోకి మార్చడానికి ప్రయత్నించడం.
-
సైనిక కారణాలు: భారతీయ సిపాయిలకు తక్కువ జీతాలు, ప్రమోషన్లలో వివక్ష, సముద్రం దాటి యుద్ధానికి వెళ్లాలనే రూల్ (హిందూ మత విశ్వాసాల ప్రకారం సముద్ర ప్రయాణం నిషిద్ధం).
రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే, రాజ్యంలో వారసులు అబ్బాయి, రాజు యువరాజు లేని సమక్షంలో , ఆ రాజ్యాన్ని బ్రిటిషులు ఆక్రమించుకునే వాళ్ళు. రాజ్య సంక్రమణ అంటే, రాజుల వారస్వతం , వాళ్ళ కొడుకులకు, మనువల్లకు, కొడుకుల కొడుకులకు వస్తు ఉండేది. కానీ ఆడపిల్లలు ఉంటె వాళ్ళు రాజ్యాన్ని ఏలడానికి వాళ్ళ శక్తి సరిపోదు అని, వాళ్ళకు వారస్వత్వం ఇవ్వలేదు. దీనికి పోటిగా ఝాన్సీ లక్ష్మిభాయి తిరుగుబాటు చేసింది.
తక్షణ కారణం (Immediate Cause)
-
బ్రిటిష్ సైన్యంలో కొత్తగా ప్రవేశపెట్టిన “ఎన్ఫీల్డ్ రైఫిళ్ళు” (Enfield Rifles).
-
ఈ తుపాకులకు వాడే తూటాలు (Cartridges) పై ఆవు కొవ్వు, పంది కొవ్వు పూశారనే వార్త కార్చిచ్చులా వ్యాపించింది. తూటాలను నోటితో కొరికి తుపాకీలో లోడ్ చేయాల్సి వచ్చేది. ఇది హిందూ, ముస్లిం సిపాయిల మత భావాలను దెబ్బతీసింది.
- హిందువులు ఎంతో ప్రేమించే, ఆరాదించే అవును, ముస్లింలు ఎంతో ఆరాదించే పంది కొవ్వును వాడడం అనేది అస్సలు ఒప్పుకోలేదు సిపాయిలు.
తిరుగుబాటు ప్రారంభం & విస్తరణ
-
మొదటి సంఘటన: 1857 మార్చి 29న బెంగాల్లోని బారక్పూర్ లండన్ బారకాసుల్లో మంగళ్ పాండే అనే సిపాయి కొవ్వు రాసిన తోటాలను వాడనని నిరసిస్తూ, బ్రిటిష్ అధికారి లెఫ్టినెంట్ బాగ్ (Lt. Baugh) ను కాల్చిచంపాడు. ఏప్రిల్ 8న మంగళ్ పాండేను ఉరితీశారు.
-
మహా తిరుగుబాటు ప్రారంభం: 1857 మే 10న మీరట్ లో సిపాయిలు అధికారికంగా తిరుగుబాటు ప్రారంభించారు.
-
ఢిల్లీ ఆక్రమణ: మే 11న మీరట్ సిపాయిలు ఢిల్లీకి చేరుకుని, చివరి మొఘల్ చక్రవర్తి అయిన రెండవ బహదూర్ షాను “భారతదేశ చక్రవర్తి” (షహన్షా-ఎ-హిందుస్తాన్) గా ప్రకటించారు.
చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న : చాలా సార్లు అడిగిన ప్రశ్న ఇది. ముఖ్యమైన కేంద్రాలు – నాయకులు – అణచివేసిన బ్రిటిష్ అధికారులు గురించి ప్రతి పేపర్స్ లో ఒక ప్రశ్న ఉంటుంది.
| తిరుగుబాటు కేంద్రం | భారతీయ నాయకుడు/నాయకురాలు | అణచివేసిన బ్రిటిష్ అధికారి |
| ఢిల్లీ | రెండవ బహదూర్ షా, జనరల్ భక్త్ ఖాన్ | జాన్ నికల్సన్, హడ్సన్ |
| కాన్పూర్ | నానా సాహెబ్, తాంతియా తోపే | కాలిన్ కాంప్బెల్ |
| లక్నో | బేగం హజ్రత్ మహల్ | కాలిన్ కాంప్బెల్ |
| ఝాన్సీ & గ్వాలియర్ | రాణి లక్ష్మీబాయి, తాంతియా తోపే | హ్యూ రోజ్ |
| బీహార్ (జగదీష్పూర్) | కున్వర్ సింగ్, అమర్ సింగ్ | విలియం టేలర్, విన్సెంట్ ఐర్ |
| ఫైజాబాద్ | మౌల్వీ అహ్మదుల్లా | కాలిన్ కాంప్బెల్ |
| బరేలీ | ఖాన్ బహదూర్ ఖాన్ | కాలిన్ కాంప్బెల్ |
హైదరాబాద్ సంస్థానంలో జరిగిన తిరుగుబాటు సంఘటనలపై ప్రత్యేకంగా ప్రశ్నలు వేసి అవకాశం ఉంది, దాని గురించి కూడా నేర్చుకోవడం చాలా మంచిది.
-
1857 తిరుగుబాటు సమయంలో హైదరాబాద్ నిజాం: అఫ్జల్-ఉద్-దౌలా (ఐదవ నిజాం).
-
ఆనాటి నిజాం ప్రధానమంత్రి: మొదటి సాలార్ జంగ్ (ఈయన బ్రిటిష్ వారికి మద్దతు ఇచ్చారు).
-
హైదరాబాద్ బ్రిటిష్ రెసిడెంట్: కల్నల్ కుత్బర్ట్ డేవిడ్సన్.
-
కోటి రెసిడెన్సీపై దాడి (1857 జూలై 17): మౌల్వీ అల్లావుద్దీన్, తుర్రేబాజ్ ఖాన్ ల నాయకత్వంలో సుమారు 5,000 మంది దేశభక్తులు హైదరాబాద్లోని బ్రిటిష్ రెసిడెన్సీ (ప్రస్తుతం కోటి ఉమెన్స్ కాలేజ్) పై దాడి చేశారు.
-
ఫలితం: తుర్రేబాజ్ ఖాన్ను బ్రిటిష్ వారు కాల్చిచంపి, ఆయన శవాన్ని కోటి రెసిడెన్సీ ముందు ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడానికి వేలాడదీశారు. మౌల్వీ అల్లావుద్దీన్ను అండమాన్ (కాలాపానీ) జైలుకు పంపారు.
-
గోండుల తిరుగుబాటు: అదిలాబాద్ నిర్మల్ ప్రాంతంలో రాంజీ గోండ్ బ్రిటిష్ వారికి, నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. రాంజీ గోండ్ను, ఆయన అనుచరులను నిర్మల్లోని ఒక మర్రిచెట్టుకు ఉరితీశారు (దీనిని “వెయ్యి ఉరుల మర్రి” అంటారు).
సిపాయిల తిరుగుబాటు వల్లనా మనం వచ్చిన పలితం ఏంటి అని ఆలోచిస్తే…
తిరుగుబాటు ఫలితాలు (Consequences)
-
ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు: భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన ముగిసింది.
-
బ్రిటిష్ రాణి ప్రత్యక్ష పాలన: 1858 నవంబర్ 1న అలహాబాద్ దర్బార్లో లార్డ్ కానింగ్ “విక్టోరియా రాణి ప్రకటన” (Queen’s Proclamation) చదివారు. దీని ద్వారా భారత పరిపాలన నేరుగా బ్రిటిష్ కిరీటం (British Crown) చేతుల్లోకి వెళ్ళింది.
-
గవర్నర్ జనరల్ హోదా మార్పు: భారత గవర్నర్ జనరల్ హోదాను “వైస్రాయ్” (Viceroy) గా మార్చారు.
-
చివరి గవర్నర్ జనరల్ మరియు మొదటి వైస్రాయ్: లార్డ్ కానింగ్.
-
-
రాజ్యసంక్రమణ సిద్ధాంతాన్ని రద్దు చేశారు.
కొన్ని ప్రశ్నలు చూద్దాం ఇప్పుడు.
- 1857 తిరుగుబాటు సమయంలో భారత గవర్నర్ జనరల్ ఎవరు?
- 1857 తిరుగుబాటు నాటి బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరు?
- 1857 మహా తిరుగుబాటు అధికారికంగా ఎక్కడ, ఎప్పుడు ప్రారంభమైంది?
- తిరుగుబాటుదారులు ఢిల్లీని ఆక్రమించి ఎవరిని భారతదేశ చక్రవర్తిగా ప్రకటించారు?
- కాన్పూర్లో తిరుగుబాటుకు నాయకత్వం వహించిన పీష్వా ఎవరు?
- నానా సాహెబ్ అసలు పేరు ఏమిటి?
- లక్నో (అవధ్) లో తిరుగుబాటుకు నాయకత్వం వహించిన మహిళ ఎవరు?
- బరేలీలో తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు?
- ఫైజాబాద్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జిహాద్ ప్రకటించిన మౌల్వీ ఎవరు?
- బీహార్ (జగదీష్పూర్) లో తిరుగుబాటుకు నాయకత్వం వహించిన 80 ఏళ్ళ వృద్ధ నాయకుడు ఎవరు?
జవాబులు
కొన్ని ప్రశ్నలు చూద్దాం ఇప్పుడు.
- 1857 తిరుగుబాటు సమయంలో భారత గవర్నర్ జనరల్ ఎవరు? జవాబు: లార్డ్ కానింగ్
- 1857 తిరుగుబాటు నాటి బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరు? జవాబు: లార్డ్ పామర్స్టన్
- 1857 మహా తిరుగుబాటు అధికారికంగా ఎక్కడ, ఎప్పుడు ప్రారంభమైంది? జవాబు: 1857 మే 10న మీరట్ (Meerut) లో
- తిరుగుబాటుదారులు ఢిల్లీని ఆక్రమించి ఎవరిని భారతదేశ చక్రవర్తిగా ప్రకటించారు? జవాబు: రెండవ బహదూర్ షా (మొఘల్ చక్రవర్తి)
- కాన్పూర్లో తిరుగుబాటుకు నాయకత్వం వహించిన పీష్వా ఎవరు? జవాబు: నానా సాహెబ్
- నానా సాహెబ్ అసలు పేరు ఏమిటి? జవాబు: ధోందు పంత్
- లక్నో (అవధ్) లో తిరుగుబాటుకు నాయకత్వం వహించిన మహిళ ఎవరు? జవాబు: బేగం హజ్రత్ మహల్
- బరేలీలో తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? జవాబు: ఖాన్ బహదూర్ ఖాన్
- ఫైజాబాద్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జిహాద్ ప్రకటించిన మౌల్వీ ఎవరు? జవాబు: మౌల్వీ అహ్మдуల్లా
- బీహార్ (జగదీష్పూర్) లో తిరుగుబాటుకు నాయకత్వం వహించిన 80 ఏళ్ళ వృద్ధ నాయకుడు ఎవరు? జవాబు: కున్వర్ సింగ్ (ఈయన్ను బీహార్ సింహం అంటారు)
కాన్పూర్ మరియు లక్నోలలో తిరుగుబాటును పూర్తిగా అణచివేసిన బ్రిటిష్ జనరల్ ఎవరు?
-
జవాబు: కాలిన్ కాంప్బెల్
ఝాన్సీ లక్ష్మీబాయితో పోరాడి, ఆమెను “తిరుగుబాటుదారులలోక ఏకైక పురుషుడు” అని కొనియాడిన బ్రిటిష్ అధికారి ఎవరు?
-
జవాబు: సర్ హ్యూ రోజ్ (Hugh Rose)
రాణి లక్ష్మీబాయి ఎక్కడ వీరమరణం పొందారు?
-
జవాబు: గ్వాలియర్ (1858 జూన్)
1857 తిరుగుబాటు సమయంలో హైదరాబాద్ నిజాం ఎవరు?
-
జవాబు: అఫ్జల్-ఉద్-దౌలా (5వ నిజాం)
1857 తిరుగుబాటు కాలంలో నిజాం ప్రధానమంత్రి (దివాన్) ఎవరు?
-
జవాబు: మొదటి సాలార్ జంగ్ (మీర్ తురాబ్ అలీ ఖాన్
కోటి రెసిడెన్సీపై దాడికి నాయకత్వం వహించిన హైదరాబాద్ వీరుడు ఎవరు?
-
జవాబు: తుర్రేబాజ్ ఖాన్
1857 తిరుగుబాటు కాలంలో బ్రిటీష్ వారికి అనుకూలంగా వ్యవహరించినందుకు గానూ నిజాం రాజుకు బ్రిటీష్ వారు ఇచ్చిన బిరుదు ఏమిటి?
-
జవాబు: స్టార్ ఆఫ్ ఇండియా (Our Faithful Ally)
“వెయ్యి ఉరుల మర్రి” (Nirmal) ఏ తిరుగుబాటుకు సంబంధించింది?
-
జవాబు: రాంజీ గోండ్ తిరుగుబాటు (1860)
ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనను రద్దు చేస్తూ బ్రిటన్ రాణి చేసిన ప్రకటనను ఏమంటారు?
-
జవాబు: విక్టోరియా రాణి ప్రకటన (1858 నవంబర్ 1)
విక్టోరియా రాణి ప్రకటనను లార్డ్ కానింగ్ ఎక్కడ చదివి వినిపించారు?
-
జవాబు: అలహాబాద్ దర్బార్
భారతదేశపు మొదటి వైస్రాయ్ ఎవరు?
-
జవాబు: లార్డ్ కానింగ్
“ది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్” (The Indian War of Independence 1857) పుస్తక రచయిత ఎవరు?
-
జవాబు: వినాయక దామోదర్ సావర్కర్ (V.D. Savarkar)
“ది సిపాయ్ ముట్నీ అండ్ ది రెబెల్లియన్ ఆఫ్ 1857” పుస్తక రచయిత ఎవరు?
-
జవాబు: ఆర్.సి. మజుందార్
1857 తిరుగుబాటును కేవలం “సిపాయిల పితూరీ” (Sepoy Mutiny) గా కొట్టిపారేసిన బ్రిటిష్ చరిత్రకారుడు ఎవరు?
-
జవాబు: సర్ జాన్ లారెన్స్ మరియు సీలే
“1857” అనే పేరుతో భారత ప్రభుత్వం తరపున అధికారిక చరిత్ర గ్రంథాన్ని రాసింది ఎవరు?
-
జవాబు: ఎస్.ఎన్. సేన్ (Surendranath Sen)
తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ సైన్యంలో భారతీయులు, బ్రిటిష్ సైనికుల నిష్పత్తిని పునర్వ్యవస్థీకరించడానికి వేసిన కమిషన్ ఏది?
-
జవాబు: పీల్ కమిషన్ (Peel Commission)
1857 తిరుగుబాటును “నాగరికతకు, అనాగరికతకు మధ్య జరిగిన యుద్ధం” అని వర్ణించింది ఎవరు?
-
జవాబు: టి.ఆర్. హోమ్స్
ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అంతమైన తర్వాత భారత వ్యవహారాలను చూసుకోవడానికి బ్రిటన్ పార్లమెంట్ ఏర్పాటు చేసిన కొత్త పదవి ఏది?
-
జవాబు: భారత వ్యవహారాల కార్యదర్శి (Secretary of State for India)
- 1857 తిరుగుబాటు సమయంలో హైదరాబాద్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గోడలపై పోస్టర్లు అంటించి, ప్రజలను చైతన్యపరిచిన రోహిల్లా నాయకుడు ఎవరు?
-
జవాబు: తుర్రేబాజ్ ఖాన్
-
1857 తిరుగుబాటు కాలంలో తిరుగుబాటుదారులు ఉపయోగించిన ప్రముఖ నినాదం ఏమిటి?
-
జవాబు: “మారో ఫిరంగి కో” (Marò Firangi Ko)
రాణి లక్ష్మీబాయి ఏ యుద్ధంలో తీవ్రంగా గాయపడి వీరమరణం పొందారు?
-
జవాబు: కోటా-కి-సెరాయ్ యుద్ధం (గ్వాలియర్ సమీపంలో)
1857 తిరుగుబాటును “కేవలం ఒక ముస్లిం కుట్ర” (A Muslim Conspiracy) అని అభివర్ణించిన బ్రిటిష్ చరిత్రకారులు ఎవరు?
-
జవాబు: సర్ జేమ్స్ ఔట్రమ్ మరియు డబ్ల్యూ. టేలర్
తిరుగుబాటు ముగిసిన తర్వాత బ్రిటిష్ వారు భారతదేశంలో ఏ విధానాన్ని అధికారికంగా అమలు చేయడం ప్రారంభించారు?
-
జవాబు: విభజించు – పాలించు (Divide and Rule)
మరిన్ని ముఖ్యమైన విషయాల గురించి మన పేజి ని ఫాలో అవ్వండి, కలిసి చదువుదాం, కలిసి నేర్చుకుందాం.
